బడ్జెట్లో బొగ్గు పెన్షనర్లకు మొండిచేయి

by Disha edit |
బడ్జెట్లో బొగ్గు పెన్షనర్లకు మొండిచేయి
X

పార్లమెంట్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు ఆదాయ పన్ను స్లాబ్‌లో మూడు లక్షల రూపాయల వరకు పన్ను లేక పోవడం, మిగతా స్లాబ్ రాయితీలు, పోస్ట్ ఆఫీస్ ఇన్ కం స్కీం పరిమితి పెంచడం మహిళ సన్మాన్ సేవింగ్ పత్రాల ద్వారా 7.5 వడ్డీ చెల్లించడం చాలా సంతోషం. కానీ అహర్నిశలు గాలి, వెలుతురు లేని భూగర్భ గనుల్లో పని చేస్తూ దేశానికి వెలుగు నిస్తున్న బొగ్గు గని కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేయక పోవడం, విశ్రాంత బొగ్గు కార్మికుల కోల్ మైన్స్ పెన్షన్ ఫండ్‌కు బడ్జెట్ సపోర్ట్ చేయక పోవడంతో రాను రాను బొగ్గు గనుల పెన్షన్ ఫండ్ తగ్గే ప్రమాదం ఉంది. కావున కోల్ మైన్స్ పెన్షన్ ఫండ్‌కు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తే బొగ్గు విశ్రాంత ఉద్యోగులకు ఊరట కలిగేది.

ఆళవందార్ వేణు మాధవ్

8686051752

Also Read...

రాష్ట్ర విద్యారంగానికి నిధులు దక్కేనా!


Next Story

Most Viewed